వాలంటీర్లకు జగన్ మరో బంపర్ ఆఫర్?
ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న సేవా వజ్ర అవార్డుల ప్రదానం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 రోజులపాటు పురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇవాళ గుంటూరు జిల్లా, ఫిరంగిపురంలో కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. వాలంటీర్లపై ఇప్పటికే విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.