గుడ్న్యూస్.. ఇవాళ వాళ్ల ఖాతాల్లోకి జగన్ డబ్బు?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు. అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికం తో కలిపి ఇప్పటి వరకూ 56,194 మంది లబ్ది దారులకు రూ. 427.27 కోట్ల మేర ఆర్థిక సాయం అందించారు.