కొత్త కండీషన్: స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు?
ప్రజాపాలన దరఖాస్తులు, తెల్లరేషన్ కార్డు ఈనెల 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్లల పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. మొదటి విడతలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3 వేల 500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు నిర్మించనున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వెంటనే మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. పేదలకు నీడ కల్పించడం ప్రభుత్వాల కర్తవ్యమని గత పాలకులు విస్మరించారని ప్రజల ఆశలను రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుందని మంత్రి పొంగులేటి విమర్శించారు.