మీరు జాగ్రత్త.. బ్యాంకు లావాదేవీలపై నిఘా?
గత రెండు నెలల్లో ఎన్నడూ లేని విధంగా జరిగే లావాదేవీలను అనుమానించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. రెండు నెలల్లో ఎప్పుడూ లేని విధంగా లక్ష రూపాయలకు మించి డిపాజిట్ లేదా విత్ డ్రా చేసిన ఖాతాల వివరాలను బ్యాంకుల నుంచి సేకరించాలని సీఈవోలకు ఈసీ తెలిపింది. గత రెండు నెలల్లో లేని విధంగా ఒకే జిల్లా లేదా నియోజకవర్గంలో అనేక మందికి ఆన్ లైన్ నగదు బదిలీ చేసే ఖాతాల వివరాలను బ్యాంకుల నుంచి తెప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. లక్ష రూపాయలకు మించి డిపాజిట్ లేదా విత్ డ్రాలు జరిగిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు సేకరించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.