సజ్జల వార్నింగ్.. వైసీపీకి మైనస్ అవుతుందా?
మా పార్టీ బలమైనదే అయినా తాము సంయమనంతో ఉన్నాం. ఈ విషయాన్ని టీడీపీ నేతలు అర్థం చేసుకోవాలి. నిగ్రహంగా ఉండటాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దు. నిజంగా తాము కన్నెర్ర చేస్తే టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపై తిరగలేరు. ఇది పద్ధతి కాదు అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఒకవేళ వైసీపీ సంయమనం కోల్పోయి దాడులు చేస్తే టీడీపీకి లాభం చేకూరుతుంది. దీనిని ఎల్లో మీడియా అనుకూలంగా మలచుకొని చంద్రబాబుకి కావాల్సిన మైలేజ్ ఇస్తుంది. మరి వైసీపీ టీడీపీ ట్రాప్ లో పడుతుందా లేదా అనేది చూడాలి.