మహిళలపై లైంగిక దౌర్జన్య ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు వారెంట్ జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు విచారణకు హాజరు కాకపోవటంతో అధికారులు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కోర్టును ఆశ్రయించారు. మూడు వారాలుగా పరారీలో ఉన్న ప్రజ్వల్ జర్మనీ నుంచి లండన్కు రైల్లో వెళ్లాడని సిట్ ఇప్పటికే ధ్రువీకరించుకుంది కూడా. ఇప్పటికే పలుసార్లు భారత్కు టికెట్లు బుక్ చేసుకొని రద్దు చేసుకున్నట్లు కూడా గుర్తించింది. అందుకే కోర్టును ఆశ్రయించిన సిట్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్టు వారెంటును జారీ చేసింది.
ఇప్పటికే ప్రజ్వల్పై ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ కూడా అయ్యింది. ప్రజ్వల్ను మరింత కట్టడి చేసేందుకు బ్యాంక్ ఖాతాలపైనా అధికారులు దృష్టి సారించారు. లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ తండ్రి హెచ్.డి.రేవణ్ణ ప్రస్తుతం బెయిల్పై బయటకొచ్చారు.