ఇవాళ పిన్నెల్లికి సుప్రీం కోర్టులో షాక్ తప్పదా?
ఈవిఎం పగలకొట్టిన కేసుతో పాటు, హత్యాయత్నం కేసులో కూడా హైకోర్టు కీలక విషయాలు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్ నంబూరి శేషగిరి రావు వాదించారు. నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన రెండు పిటిషన్లపై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ల వెకేషన్ ధర్మాసనం విచారణ జరపనుంది. మరి కేసు తీవ్రత దృష్ట్యా పిన్నెల్లికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు చెబుతుందేమో అన్న ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది.