అక్కడ రీపోలింగ్ కోరుతూ సుప్రీంకోర్టుకెళ్లిన వైసీపీ?
హైకోర్టు తీర్పు ను సవాలు చేస్తూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మోహిత్ రెడ్డి పిటిషన్ పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది. ఓ వైపు రేపే కౌంటింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రీపోలింగ్ జరపాలంటూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్ వేయడం సంచలనం కలిగిస్తోంది. మరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్పై సుప్రీం కోర్టు ఏం తీర్పు చెబుతుందో చూడాలి.