పోలవరంపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం?
ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివలయంలోనే ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి కెబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉంది. పోలవరం పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్న ప్రభుత్వం.. నిరంతరం సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు సూచించారు. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని పరిపాలన పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.