బీజేపీ ఫుల్ ఫైర్.. గోవధ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?
హిందువులను, గో రక్షకులపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టాల్సిన పోలీసులు దాడికి గురైన వారిపై నమోదు చేశారని.. 23మంది హనుమాన్ మాలధార చేసిన భక్తులపై కేసులు పెట్టారని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అనే అనుమానం కల్గుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శాంతి భద్రతలకు సంబంధించిన శాఖ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్నపటికీ విచ్చలవిడితనం పెరిగిపోయిందని.. హిందువులపైన జరిగిన దాడులపై న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.