విద్యా వ్యవస్థపై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం?
ఈ సమీక్షకు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రతీ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్కిటెక్చర్స్ రూపొందించిన పలు నమూనాలను పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం... ఒకే చోట ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం పైలట్ ప్రాజెక్ట్ గా కొడంగల్, మధిర నియోజవర్గాల్లో ఈఇ గురుకులాలు ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో 20ఎకరాలు చొప్పున ప్రభుత్వం సేకరించింది.