చంద్రబాబా మజాకా.. భలే రికార్డు కొట్టేశారే?
నిన్న రాత్రి 7 గంటల సమయానికి 61,60,825 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. 4,159 కోట్ల రూపాయల పెన్షన్ మొత్తం లబ్ధిదారులకు అందజేశారు. 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా జరగని పెన్షన్ పంపిణీ.. ఇప్పుడు దాదాపు ఒక్క రోజులోనే పూర్తయింది. 1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగుల తో రికార్డు స్థాయిలో 12 గంటల వ్యవధి లో పెన్షన్లు పంపిణీ చేసేశారు. గత ప్రభుత్వ హయంలో 2.65 మంది వాలంటీర్ లు ఉన్నా ఒక్క రోజులో కేవలం 88 శాతం మాత్రమే పంపిణీ చేసింది.