జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ఎన్నికలు జరపండి?
4 నెలల లోపు ఎన్నికలు పూర్తి చేయాలని కోరగా కమీషనర్ సానుకూలంగా స్పందించారు. అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిత్యం అనేక ఇబ్బందులు పడుతూ జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటున్న జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని జెసిహెచ్ఎస్ నాయకులు కోరారు .
కమీషనర్ ను కలిసిన వారిలో జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నాయకులు బ్రహ్మండబేరి గోపరాజు, భీమగాని మహేష్ గౌడ్, సునీత, గయాస్ పాషా, జి.రఘు, పి.సాగర్, పర్వీన్ బాబీ , ఎం.శ్రీనివాస్, రామకృష్ణ, కె.రాజు, విఘ్నేశ్వర్ రావు, ముని రాజు తదితరులు ఉన్నారు.