ఇవాళ టీటీడీ కీలక మీటింగ్.. ఆ నిర్ణయం తీసుకుంటారా?

frame ఇవాళ టీటీడీ కీలక మీటింగ్.. ఆ నిర్ణయం తీసుకుంటారా?

Chakravarthi Kalyan
ఇవాళ తిరుమల అన్నమయ్య భవనంలో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం జరగబోతోంది. చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్యక్షతన టీటీడీ  ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహిస్తారు. రూ.5,400 కోట్లు అంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ కు  టీటీడీ బోర్డు ఆమోదం తెలపనుంది.

అలాగే బడ్జెట్ తోపాటు 30 అంశాలపై ధర్మకర్తల మండలి చర్చించి తీర్మానాలు చేయనుంది. దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఒక ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. ప్రవేటు బ్యాంకుల్లోని టీటీడీ డిపాజిట్ లను వెనక్కు తీసుకొని  జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ పై కూడా చర్చిస్తారు.
దీనితో పాటు నిపుణుల కమిటీ సిఫార్సులకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలుపే అవకాశం ఉంది. వేసవి సెలవులు రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేయడం పై కూడా  టీటీడీ ధర్మకర్తల మండలి చర్చించే అవకాశం ఉంది. ఇలాంటి కీలక నిర్ణయాలకు ఇవాళ ఆస్కారం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd

సంబంధిత వార్తలు:

Unable to Load More