ఉద్యోగులకు వెరీ బ్యాడ్ న్యూస్..?
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటులో 0.15శాతం కోత విధించింది. ఈ తగ్గింపు ఏడేళ్ల కనిష్టం. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ నేతృత్వంలో సమావేశమైన ఉద్యోగుల భవిష్య నిధి సంస్ధ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో లోటును భర్తీ చేసుకునేందుకు EPFO ఈ నిర్ణయం తీసుకుంది.