ఎయిర్ ఇండియా తీపి క‌బురు...విమాన స‌ర్వీసుల‌కు ఓకే..

Spyder

లాక్‌డౌన్ మే3 వ‌ర‌కు పొడ‌గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత కూడా లాక్‌డౌన్ కొన‌సాగుతుందా..? అన్న అనుమానాలు మాత్రం వీడడం లేదు. దేశంలో అంత‌కంత‌కూ పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా అనేక‌మంది విమాన స‌ర్వీసుల కోసం గంపెడాశ‌తో ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌ట్లో రైలు స‌ర్వీసులు ఆరంభమ‌య్యే ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోవ‌డంతో మ‌ధ్య త‌ర‌గ‌తి నుంచి ఉన్న‌త వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల వ‌ర‌కు అంద‌రూ విమాన స‌ర్వీసుల‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారు. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు ఎయిరిండియా కాస్త తీపి క‌బురు చెప్పింది.విమాన స‌ర్వీసుల‌పై  కొంతమేర స్పష్టత ఇచ్చింది.  కొన్ని విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్‌ మే 4 నుంచి మొదలవుతాయని సంస్థ ప్రకటించింది. 


ఇక {{RelevantDataTitle}}