ఉద్యోగులకు శాశ్వత వర్క్‌ ఫ్రం హోం ఇవ్వబోతున్న మైక్రోసాఫ్ట్‌...!

Suma Kallamadi
కరోనా వైరస్ నేపథ్యంలో అనేకమంది ఉద్యోగస్తులకు వారి కంపెనీల వారు వర్క్ ఫ్రొం హోమ్ ఈ సదుపాయాన్ని ఇచ్చి ఇంటి దగ్గర నుంచి పని చేసుకునే విధంగా అవకాశం కల్పించాయి. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దిగ్గజ కంపెనీలు ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత తగ్గడంతో మళ్లీ కొద్ది శాతం మేర ఎంప్లాయిస్ ను తిరిగి ఉద్యోగాలకు హాజరుకావాల్సిందిగా చెబుతున్నాయి. ఇకపోతే తాజాగా డిజిటల్ రంగంలో దిగ్గజ కంపెనీలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ కంపెనీ తాజాగా ఉద్యోగుల విషయంలో ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీలో కొన్ని విభాగాలలో పనిచేసే ఉద్యోగులకు శాశ్వతంగా ఇంటి నుంచే పని చేసుకునేటట్లుగా వీలు కల్పించబోతున్నట్లు తెలిపింది. మైక్రోసాఫ్ట్ లో పనిచేసే ఉద్యోగులు కరోనా బారినపడకుండా ఉండేందుకు లాక్ డౌన్ సమయం లో వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ తోనే వారి ఉద్యోగులతో పని చేయించుకుంది. అయితే లాక్ డౌన్ సమయం లో కూడా ఐటీ దిగ్గజ కంపెనీలు అన్నీ లాభపడినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ మళ్లీ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించుకునేందుకు సన్నాహాలు మొదలు పెట్టాయి.


ఇకపోతే తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థ తీసుకున్న ప్రకటనలో హార్డ్వేర్ ల్యాబ్స్, డేటా సెంటర్లు, శిక్షణ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మినహా ఇతర విభాగాల్లో పని చేసే ఉద్యోగులు పూర్తిగా శాశ్వతంగా పని చేసేందుకు వీలు కల్పించే విధంగా మైక్రోసాఫ్ట్ సంస్థ నిర్ణయం తీసుకుంది. అయితే ఇలా శాశ్వతంగా పూర్తిగా ఇంటి నుంచి పని చేయాలి అనుకున్న వారికి వారి ఉన్నత ఉద్యోగులతో చేర్చి పూర్తిగా నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగస్తులకు సూచించింది.


ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు వారి స్వస్థలం నీకు కూడా మార్చుకునే అవకాశాన్ని కల్పించింది మైక్రోసాఫ్ట్ సంస్థ. అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులు తమ స్వదేశాలకు వెళ్లిపోవడంతో ఈ ఆప్షన్ కొద్దిమేర సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇందుకు సంబంధించి ఎవరైతే శాశ్వత వర్క్ ఫ్రొం హోమ్ తీసుకుంటారో వారికి వారి జీవితాలలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఇందుకోసం మేనేజర్ నుంచి ఉద్యోగులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: