ఎల్ఐసి పాలసీ దారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!
ఎల్ఐసీకి... ప్రభుత్వ అతి పెద్ద లైఫ్ ఇన్స్యూరెన్స్ , సంస్థ.. తీసుకొనే వారికి ఎప్పటికప్పుడు మంచి బెనిఫిట్స్ అందుకుంటుంది. కరోనా కారణంగా క్లెయిమ్ విషయం లో పాలసీదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడం లో ముందడుగు వేసింది. మెచ్యూరిటీ తీరిన పాలసీలను తమ సమీప ఎల్ఐసీ కార్యాలయాల్లోనే క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, ఈ అవకాశం కేవలం ఈ నెలాఖరు వరకే ఉంటుందని స్పష్టం చేసింది.
పాలసీ క్లెయిమ్ కోసం ఆయా పాలసీదారులు తమ సమీప ఎల్ఐసీ కార్యాలయాన్ని సందర్శించి డాక్యుమెంట్స్ను అందించాలని కోరారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న113 డివిజనల్ ఆఫీసులు, 2,048 బ్రాంచులు, 1,526 శాటి లైట్ ఆఫీసులు, 74 కస్టమర్ జోన్ల లో ఈ సర్వీసుల ను పొందవచ్చని స్పష్టం చేసింది. పాలసీని ఎక్కడ తీసుకున్నా కూడా ఎక్కడైనా క్లైయిమ్స్ చెల్లింపులకు సంభందిత సర్వీస్ బ్రాంచ్ ప్రాసెస్ చేస్తుందని అంటున్నారు.
కొత్త పాలసీలను తీసుకొచ్చే ఎల్ఐసీ.. తాజాగా బచత్ ప్లస్ పేరిట కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. పాలసీదారుడికి బీమా రక్షణ తో పాటు పొదుపు కోసం దీన్ని రూపొందించింది. ఐదేళ్ల మెచ్యూరిటీ కాలపరిమితితో వచ్చే ఈ ప్లాన్లో చేరిన పాలసీదారుడు హఠాత్తుగా మరణిస్తే, అతని కుటుంబానికి రెండు విధాలుగా పరిహారం చెల్లిస్తుంది. పాలసీ అమల్లో ఉన్న ఐదేళ్లలో మరణిస్తే.. నిబంధనల ప్రకారం ఒకేసారి పాలసీ విలువను చెల్లిస్తారు. అతని కుటుంబానికి పరిహారం తో పాటు లాయల్టీని కలిపి అందజేస్తారు. ఈ ప్లాన్లో చేరిన పాలసీదారుడు సింగిల్ ప్రీమియం విధానంలో ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించవచ్చు లేదా ఐదేళ్ల పాటు వాయిదాల్లో చెల్లించవచ్చు. పాలసీదారుడు 80సీ కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.. ఈ పాలసీ పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. ఇలా చేయడం వల్ల అన్నీ విధాలుగా పాలసిదారులకు బెనిఫిట్స్ ఉంటాయని అంటున్నారు..