దేశంలోని గవర్నమెంట్ ఆయిల్ కంపెనీలు అన్ని ప్రతిరోజూ కూడా ఉదయం పెట్రోల్, డీజిల్ కొత్త ధరను నిర్ణయిస్తాయి.జూలై 15 వ తేదీన అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు రేట్లు కొంతమేరకు తగ్గుముఖం పట్టాయి.బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇంకా డబ్ల్యుటిఐ క్రూడ్ ఆయిల్ రెండూ రెడ్ మార్క్లో ట్రేడవుతున్నాయి.ఈ బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ మొత్తం 1.91 శాతం భారీ క్షీణతతో $ 75.42 వద్ద ట్రేడవుతోంది. ఇంకా అదే సమయంలో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్కు 1.83 శాతం క్షీణతతో $ 79.87 వద్ద ట్రేడవుతోంది. అయితే కొన్ని నగరాల్లో మాత్రమే ధరల్లో మార్పులున్నాయి.దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాలు చెన్నైలో పెట్రోల్ ఇంకా డీజిల్ ధర తగ్గింపు కనిపిస్తోంది. శనివారం నాడు పెట్రోల్పై 11 పైసలు ఇంకా డీజిల్పై 9 పైసలు తగ్గగా లీటరుకు వరుసగా రూ.102.63, రూ.94.24 చొప్పున లభిస్తున్నాయి. ఇంకా ఇది కాకుండా, దేశ రాజధానిలో ధరల్లో ఎలాంటి మార్పులు అనేవి లేవు.
ఇక్కడ రూ. 96.72, రూ.89.62 వద్ద ఇది కొనసాగుతోంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్కతాలో కూడా ఇంధన ధరలు ఫిక్స్డ్ గా ఉన్నాయి. ఇక్కడ రూ. 106.03 ఇంకా రూ. 92.76గా ఉన్నాయి. ఇక తెలంగాణ రాజధాని భాగ్యనగరంలో లీటర్ పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు వరుసగా 109.66 రూపాయలు అలాగే 97.82 రూపాయలుగా ఉంది.వినియోగదారుల సౌకర్యార్థం ఆయిల్ కంపెనీలు కేవలం మెసేజ్ల ద్వారానే ప్రతిరోజూ పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలను చెక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. bpcl కస్టమర్లు అయితే 9223112222కి, ఇండియన్ ఆయిల్ కస్టమర్లు అయితే RSP ని 9224992249 మెసేజ్ పంపాల్సి ఉంటుంది. ఇంకా అలాగే hpcl కస్టమర్లు HPPRICE ని 9222201122 మెసేజ్ చేస్తే ధరలు వస్తాయి.ఇలా వాటికి మెసేజ్ చేస్తే మీరు కొన్ని నిమిషాల్లో కొత్త ధరలను తెలుసుకుంటారు.