ఇండియా పెట్టుబడుల కోసం బ్రిటన్ ఎదురుచూపులు?
బ్రిటన్ ప్రపంచంలోకెల్లా ఆరో ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. బ్రిటన్ అయిదో స్థానంలో ఉండేది. ఆ స్థానాన్ని భారత్ ఆక్రమించింది. భారతీయులకు పాలన చేతకాదు. వారికి చదువు నేర్పించాం.. అన్నీ నేర్పించామని చెప్పుకుంటుండే వారు. అలాంటిది నేడు బ్రిటన్ లో భారత్ నుంచి వెళ్లిన ఒక కంపెనీ ఆ దేశంలో పెట్టుబడులు పెట్టి అక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించనుంది.
బ్రిటన్ లో పెట్టుబడులు పెట్టేందుకు టాటా స్టీల్ కంపెనీ సిద్దంగాా ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, టాటా స్టీల్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. దాదాపు 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో అక్కడ స్టీల్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయినట్లు ప్రకటించారు. దీంతో బ్రిటన్ లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం వస్తుంది. భారత్ నుంచి వెళ్లిన ఒక కంపెనీ బ్రిటన్ లో ఉద్యోగాలు కల్పించడమంటే మామూలు విషయం కాదు.
ప్రపంచ దేశాలన ఏలిన బ్రిటన్ లో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భారత సమాజానికి ఇదొక గొప్ప అచీవ్ మెంట్ లాంటిది. బ్రిటన్ ను దాటి భారత్ ఆర్థిక రంగంలో ముందుకెళ్లింది. అదే సమయంలో మరో రెండు దేశాలను దాటి మూడో స్థానానికి రావాలని ఆశిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.