పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్)తో పాటు వివిధ పన్ను ఆదా చేసే ఎఫ్డీల్లో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా పన్నుని చాలా ఈజీగా ఆదా చేయవచ్చు. ఓ నివేదిక ప్రకారం, కొన్ని బ్యాంకులు పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 7 శాతం దాకా వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఆ బ్యాంకుల వివరాలేంటో? ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పన్ను ఆదా చేసే ఎఫ్డీలపై 6.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ కూడా 6.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఐదేళ్లలో ఈ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టిన రూ.1.5 లక్షలనేవి రూ.2.07 లక్షలకు పెరుగుతాయి.అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ పన్ను ఆదా చేసే ఎఫ్డీపై 6.7 శాతం దాకా వడ్డీని అందిస్తున్నాయి. ఈ రెండు ప్రభుత్వ బ్యాంకుల్లో ఐదేళ్ల పాటు రూ. 1.5 లక్షల ఎఫ్డీని కనుక మెయింటెయిన్ చేస్తే, మెచ్యూరిటీపై రూ.2.09 లక్షలు పొందుతారు.
ఇక పన్ను ఆదా చేసే ఎఫ్డీలపై ఫెడరల్ బ్యాంక్ 6.6 శాతం దాకా వడ్డీని ఆఫర్ చేస్తుంది. ఫెడరల్ బ్యాంక్ పన్ను ఆదా ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసిన రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే ఐదేళ్లలో మొత్తం రూ.2.08 లక్షలకు పెరుగుతాయి.ఇంకా అలాగే దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా పన్ను ఆదా చేసే ఎఫ్డీలపై గణనీయమైన రాబడిని ఇస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఎవరైనా పన్ను ఆదా చేసే ఎఫ్డీ చేస్తే వారికి మొత్తం 7 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. అంటే ఇందులో ఇన్వెస్ట్ చేసిన రూ. 1.5 లక్షల మొత్తం ఐదేళ్లలో ఈజీగా రూ.2.12 లక్షలు అవుతుంది.ఇక పన్ను ఆదా చేసే ఎఫ్డీలపై అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకులు ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ మొదటి వరుసలో ఉంటాయి.ప్రస్తుతం, ఈ రెండు బ్యాంకుల్లో పన్ను ఆదా చేసే ఎఫ్డీలపై 7.25 శాతం దాకా వడ్డీ లభిస్తుంది. ఐదేళ్లలో ఇక్కడ పెట్టుబడి పెట్టిన రూ.1.5 లక్షలు రూ.2.15 లక్షలకు పెరుగుతుంది.