ఈ సంవత్సరం మేలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.అయితే దీనికి ముందు ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేయనుంది. పీఎం కిసాన్ యోజన తదుపరి విడత మొత్తం కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.పీఎం కిసాన్ పథకంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ఏడాదికి మూడు సార్లు 2 వేల రూపాయల చొప్పున మొత్తం 6 వేల రూపాయలను రైతుల ఖాతాల్లో వేస్తోంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.8 వేలకు పెంచనుందని సమాచారం తెలుస్తుంది. మీడియా కథనాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు వాయిదా మొత్తాన్ని రూ.8000కు పెంచుతుందని సమాచారం తెలుస్తుంది. రూ.2 వేల చొప్పున నాలుగు సార్లు ఇవ్వనుందని పలు జాతీయ వార్తా సంస్థల నుంచి సమాచారం తెలుస్తుంది.వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పెంపు ఉండే అవకాశం ఉందని తెలిపాయి. దీంతో పాటు పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన మొత్తాన్ని కూడా పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది. కేంద్రం తన ఫ్లాగ్షిప్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి) స్కీమ్, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) పథకం కింద 2024 లోక్సభ ఎన్నికలకు ముందు వాయిదాల చెల్లింపు మొత్తాన్ని పెంచాలని యోచిస్తోందని సమాచారం తెలిసింది.
దీంతో 16వ విడత పీఎం కిసాన్ డబ్బుల కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయితే ఈ వాయిదా ఫిబ్రవరి-మార్చిలో విడుదల కావచ్చు.మీరు కూడా ఈ పథకంలో ఉంటే అందులో మీ స్టేటస్ని చెక్ చేయాలనుకుంటే, మీరు పథకం అధికారిక వెబ్సైట్ pmkisan.gov.inకి వెళ్లాలి.ఇక ఆ తర్వాత వెబ్సైట్లో మీకు 'నో యువర్ స్టేటస్' అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ మీరు క్లిక్ చేయండి. దీని తర్వాత మీరు మీ రిజిస్ట్రేషన్ నంబర్ను ఎంటర్ చేసి, ఆపై స్క్రీన్పై ఇచ్చిన క్యాప్చా కోడ్ను పూరించాలి. ఇక ఇప్పుడు మీరు గెట్ ఓటీపీ ఆప్షన్పై క్లిక్ చేసి, ఆపై మీ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ముందు స్క్రీన్పై మీ స్టేటస్ ని చూస్తారు, ఇక్కడ మీరు e-KYC స్టేటస్, అర్హత, ల్యాండ్ సైడింగ్ని చెక్ చేయాలి. తరువాత వాటి పక్కన ఏమి రాయబడిందో చూడాలి. ఈ మూడు లేదా వాటిలో ఏదైనా ఒకదాని ముందు 'నో' అని వస్తే , మీ ఇన్స్టాల్మెంట్ ఆగిపోతుంది. అదే సమయంలో ఈ మూడింటికి ముందు 'అవును' అని వస్తే వాయిదాల సొమ్ము మీ అకౌంట్ లోకి వస్తుంది.