విమాన ప్రయాణికులకు 'గోఎయిర్‌' సూపర్ ఆఫర్..!

Vamsi
దేశీయ ఎయిర్‌లైన్ సంస్థ గో ఎయిర్ విమాన ప్రయాణికులకు ఓ సూపర్ ఆఫర్ ప్రకటించింది. సమ్మర్ సేల్ తర్వాత మాన్‌సూన్ ఆఫర్ పేరిట గో ఎయిర్ భారీగా ధరలను తగ్గించింది.  ఆ మద్య మాన్‌సూన్ క్యాంపెయిన్ పేరుతో రూ.599తో టికెట్ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఎయిర్‌లైన్ సంస్థ గోఎయిర్ అతి తక్కువ ధరకే విమాన టిక్కెట్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

టిక్కెట్‌ను రూ.991కే విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్‌ కింద కస్టమర్లకు గోఎయిర్‌  ఆఫర్‌ చేస్తున్న టిక్కెట్లను 2018 ఫిబ్రవరి 20 వరకు బుక్‌ చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా టిక్కెట్లను బుక్‌ చేసుకునే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ అందుబాటులో ఉండనుందని గోఎయిర్‌ వెబ్‌సైట్‌పేర్కొంది.

అయితే 'GOHDFC10' ప్రోమో కోడ్‌ను కస్టమర్లు వినియోగించాల్సి ఉంటుంది. 2018 ఫిబ్రవరి 20 వరకే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడే బుక్‌ చేసుకోండి'' అంటూ గోఎయిర్‌ తెలిపింది. ఈ ఆఫర్‌కు స్టాండర్డ్‌ క్యాన్సిలేషన్‌, రీబుకింగ్‌ పాలసీ అమల్లో ఉంటుంది. ఈ ఆఫర్‌ కింద పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. గ్రూప్‌ డిస్కౌంట్‌కు ఈ ఆఫర్‌ పనిచేయదు. ఇన్‌ఫాంట్‌ బుకింగ్‌కు ఇది అందుబాటులో ఉండదు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: