ఇప్పుడు మార్కెట్లో ఎలాక్ట్రానిక్ రంగానిదే హావా నడుస్తుంది.స్మార్ట్ టీవీల దగ్గరి నుండి,స్మార్ట్ మొబైల్స్ వరకు అన్ని కొత్త కొత్త మోడల్సె,ఈ రోజున్న ఫ్యూచర్స్ రేపుండవు,రేపున్న ఫ్యూచర్స్ మరునాడుండవు ఇలా పలు కంపెనీలు పోటీ పడి తమ బ్రాండ్ విలువను పెంచుకుంటున్నాయి.ఇక స్మార్ట్ఫోన్ మార్కెట్లో సంచనాలు సృష్టించిన షావోమీ సంస్థ...ఇప్పుడు టెలివిజన్ మార్కెట్లోనూ అదరగొడుతోంది.ఇప్పటికే ఎంఐ బ్రాండ్ పేరిట పలు స్మార్ట్ టీవీలను తీసుకొచ్చింది.అద్భుతమైన ఫీచర్లున్న ఈ టీవీలను తక్కువ ధరకే అందిస్తూ సామ్సంగ్,ఎల్జీ,పానసోనిక్,సోని సహా పలు కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది.
తాజాగా రెడ్మీ బ్రాండ్ పేరిట తొలి స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది షావోమీ..బీజింగ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ స్మార్ట్టీవీని విడుదల చేసింది.చూడటానికి ఆకర్శణీయంగా వుండి 70 అంగుళాల స్క్రీన్తో వచ్చిన ఈ కొత్త స్మార్ట్టీవీలో అనేక ఫీచర్లను పొందు పరిచింది..ఇక సెప్టెంబరు 10 నుంచి చైనాలో రెడ్మీ స్మార్ట్టీవీ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.ఇప్పటికే ప్రీ ఆర్డర్లు కూడా మొదలయ్యాయి.మరి దీని ధరెంత అనుకుంటు న్నారా అక్కడి కరెన్సీలో ఈ ఫోన్ ధర 3,799 చైనీస్ యువాన్లు అంటే ఇండియాలో రూ.38,000 గా సంస్థ నిర్ణయించింది.సెప్టెంబరు నెలాఖరు నాటికి ఈ స్మార్ట్టీవీని భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని సంస్ధ ప్రతినిధులు చెబుతున్నారు..
ఇక ఈ టీవీ ఫీచర్స్ను ఒక సారి పరిశీలిద్దాం..
రెడ్మీ ' 70-ఇంచ్' స్మార్ట్టీవీ ఫీచర్లు..
✦70 అంగుళాల, 4 కే రెజల్యూషన్ స్క్రీన్
✦ పాచ్వాల్ ఫ్లాట్ఫామ్ సపోర్ట్
✦ క్వాడ్ కోర్ ప్రాసెసర్ - 64 బిట్ ఆమ్లోజిక్ ఎస్వోసీ కోర్
✦ హెచ్డీఆర్ సపోర్ట్
✦ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
✦ డాల్బీ ఆడియో, డీటీఎస్ హెచ్డీ సపోర్ట్
✦ డ్యూయల్ బ్యాండ్ వైఫై
✦బ్లూటూత్ 4.2
✦ డ్యూయల్ యూఎస్బీ పోర్ట్స్
✦ హెచ్డీఎంఐ పోర్ట్
✦ ఏవీ ఇన్పుట్
✦ మరెన్నో ఆకర్ణణీయమైన ఫీచర్లు ఉన్నాయి.