యువతి అదృశ్యం.. ఆరా తీస్తే షాకింగ్ నిజం?
ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా బ్రతకలేను ఇక జీవితాంతం నీతో బ్రతకాలి అనుకున్నాను అంటూ మాయ మాటలు చెబుతున్నా ఎంతోమంది ఆ తర్వాత ఉన్మాదులు గా మారిపోయి ప్రేమించిన యువతులపై దారుణంగా దాడులు చేస్తున్న ఘటనలు అందర్నీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక్కడ ఓ యువకుడు నువ్వే ప్రపంచం అంటూ మాయమాటలు చెప్పాడు. ఎన్ని రోజుల పాటు ప్రేమను నటించాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని నిలదీయడంతో అసలు స్వరూపం బయటపెట్టి నువ్వే ప్రాణం అంటూ ప్రేమించిన ప్రియురాలి ప్రాణాలను గాల్లో కలిపేశాడు.
ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లో వెలుగులోకి వచ్చింది. అఖిల్ వరలక్ష్మి అనే యువతీయువకులు ప్రేమించుకున్నారు. ఎన్నో రోజుల పాటు ప్రేమలో మునిగితేలారు. అయితే ఇటీవలే వరలక్ష్మి కనిపించకుండాపోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడు అఖిల్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో వరలక్ష్మీ హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.