అసలు వీడు తండ్రేనా.. తొమ్మిది నెలల కూతురునీ?

praveen
కంటికి రెప్పలా కాచుకోవాల్సిన కన్న తండ్రే కాల యముడు గా మారిపోయాడు. ఇంకా లోకాన్ని కూడా సరిగా చూడని తన కన్న కూతురు విషయంలోనే కర్కశంగా వ్యవహరించాడు. సాధారణంగా ఎవరైనా చిన్న పిల్లలు చూసే ప్రతి ఒక్కరి మనస్సులో ఆనందం వెల్లివిరుస్తుంది. మనకు తెలియని వాళ్ళు అయినా సరే చిన్నారులను పలకరించడం లాంటివి చేస్తూ ఉంటాం. ఎందుకో ఇక చిన్నారుల ముఖంలో ఆనందం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా కన్నతండ్రి  అభం శుభం తెలియని 9 నెలల పసికందు ను చిదిమేశాడు.

 ఈ ఘటనతో స్థానికులు అందరూ  ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఇక తానే తన చిన్నారి కూతురును చంపినట్లు పోలీసులు ముందు తండ్రి అంగీకరించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోని బాపాన్ గుట్ట తండా లో వెలుగులోకి వచ్చింది. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న నరేష్ రజని దంపతులకు ప్రియ అనే తొమ్మిది నెలల కుమార్తె ఉంది. అయితే ఇటీవల ఇక ఈ చిన్నారి అదృశ్యమైంది అంటూ షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇక కిషన్నగర్ శివారులో చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు స్థానికులు చెప్పగా అక్కడికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 అయితే చిన్నారి తలపై దారుణంగా కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే తన కూతుర్ని చంపాను అంటూ తండ్రి   నరేష్ భార్యతో కలిసి నేరుగా షాద్నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి నేరం అంగీకరించాడు. అయితే ప్రస్తుతం దంపతులు అనారోగ్యంతో బాధపడుతుండటంతో తరచూ గొడవ పడుతూ ఉంటారు. అయితే మద్యం మత్తులో చిన్నారి ని చంపేశాడా.. లేకపోతే ఆరోగ్య పరిస్థితి కారణంగా హతమార్చడా తేలాల్సి ఉంది. అయితే భర్త పోలీసుల ముందు లొంగిపోగా.. భార్య కూడా పొంతన లేని సమాధానాలు చెపుతూ ఉండడంతో ఆమెపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయనీ తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: