మరోకరితో లవర్ పెళ్లి.. కళ్యాణ మంటపం వద్దే ప్రియుడు సూసైడ్..

Satvika
ప్రేమించిన ప్రతి ఒక్కరూ పెళ్ళి వరకూ వెళ్లరు.. పెళ్ళి చేసుకున్న ప్రతి ఒక్కరూ ప్రేమగా ఉండరు అనే విషయం తెలిసిందే.. పెళ్ళి అనేది ఎవరితో జరగాలని ఉంటే వారితోనే జరుగుతుంది.. అది స్వర్గంలో నిర్ణయించారని పెద్దలు అంటారు.అయితే ఈ మధ్య ప్రేమించిన అమ్మాయి  దక్కలేదని ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా మరో ఘటన వెలుగులో కి వచ్చింది. హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది.

వివరాల్లొకి వెళితే.. హైదరాబాద్ లో దారుణం జరిగింది. ప్రియురాలి కి మరో వ్యక్తి తో వివాహం జరగడంతో ప్రియుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నాని కి పాల్పడ్డాడు. ప్రియురాలి కి వివాహం జరుగుతున్న ఫంక్షన్ హాల్ వద్దకే వెళ్లి ఒంటి పై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన లంగర్‌హౌజ్ లో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజేంద్ర నగర్‌కు చెందిన షేక్ ఆశ్వక్‌, స్థానికంగా ఉన్న ఫాతిమా ను గత కొంత కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఈ విషయం ఇంట్లో తెలియడం తో ఫాతిమాకు మరొకరితో పెళ్లి చేయాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు నిన్న లంగర్‌హౌస్‌ లోని మొగల్ ఫంక్షన్ హాల్‌ లో ఫాతిమా కు మరో వ్యక్తితో పెళ్లి చేశారు. ఈ విషయం ఆశ్వక్‌ కు తెలియడం తో తీవ్ర మనస్తాపాని కి గురయ్యాడు. వెంటనే పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లి.. కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలార్పి, అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు.. అతని పరిస్థితి ప్రస్తుతం విషమం గా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: