ఒక చిన్న స్థాయి అధికారి అయినా తమ పనులు తాము చేసుకోవడానికే ఇతరులపై ఆధారపడుతుంటారు. ఒక్కసారి కారు ఎక్కారంటే కారు దిగే ముచ్చటే ఉండదు . కానీ ఓ జిల్లా కలెక్టర్ ఏకంగా తన కారు టైర్ ను మార్చుకుంది. ఎవరి సహాయం లేకుండానే జాకీ పెట్టి కారు టైర్ ను అమర్చారు. ఆ కలెక్టర్ కూడా మన తెలుగు వారై ఉండటం గర్వకారణం. పూర్తి వివరాల్లోకి వెళితే... తెలుగింటి ఆడపడుచు మైసూరు జిల్లా కలెక్టర్ రోహిణి సిందూరి తన కుటుంబ సభ్యులతో కలిసి కొడుగు పర్యాటక ప్రాంతానికి విహార యాత్రకు వెళ్లారు. ఆ సమయంలో రోహిణి సొంతంగా కారును డ్రైవ్ చేసుకుం