‘నాకు లేకపోతే ఎవరికీ ఉండకుడదు..’ 3 ఏళ్ల చిన్నారిని మహిళ ఏం చేసిందంటే..
భవానీనగర్ పీఎస్ పరిధిలో ఈదీబజార్ కుమ్మర్వాడీ కాలనీలో మహ్మద్ ఏత్తెషాముద్దీన్ అనే వ్యక్తి నివశిస్తున్నాడు. అతడికి మమ్మద్ సుజావుద్దీన్ అనే తమ్ముడున్నాడు. 2019 నవంబర్లో సుజావుద్దీన్కు అయేషాబాను(21)తో వివాహం జరిగింది. అప్పటి నుంచి వారు సంతానం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ 16 నెలలైనా సంతానం కలగకపోవడంతో అయేషాబాను దుర్మార్గంగా మారిపోయింది. దానికి తోడు సజావుద్దీన్ సోదరుడు ఏత్తేషాముద్దీన్కు కొడుకు పుట్టడంతో ఆమె బాధ రెట్టింపైంది. ఈ క్రమంలోనే తనకు పిల్లల కోసం తరుచూ భర్తతో గొడవ పడేది. తనకు పిల్లలు లేరని, ఎవరికీ పిల్లలు ఉండకూడదని విచిత్రంగా మాట్లాడేది.
ఒకరోజు ఈ గొడవల్లోనే ఇంట్లో కరెంట్ తీగలను బయటకు లాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వాటిని సరిచేయించి, అయేషా బానును పుట్టింటికి పంపించేశారు. కొన్ని రోజుల తర్వాత కుటుంబసభ్యులు సర్దిచెప్పడంతో అయేషాబాను మళ్లీ భర్త దగ్గరకు వచ్చింది. అయితే బావ తనయుడిని చూసినప్పుడల్లా అయేషాకు తీవ్ర ఆగ్రహం కలిగేది. ఈ క్రమంలోనే మంగళవారం ఎత్తెషాముద్దీన్ కుమారుడు నుమానుద్దీన్(3)ను మాయమాటలతో రెండో అంతస్తుపైకి తీసుకెళ్లి, అక్కడి నుంచి కిందకు విసిరేసింది.
చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబసభ్యులు గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తలకు తీవ్రగాయం కావడంతో దారిలోనే చిన్నారి ప్రాణాలు వదిలాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను భవానీనగర్ పీఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ వెల్లడించారు. అయేషాబానుపై హత్యానేరం పోపనున్నట్లు పోలీసులు తెలిపారు.