అతడికి స్మార్ట్ ఫోన్ వాడే అమ్మాయిలే టార్గెట్..!
ముఖ్యంగా ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీ ఎంత వేగంగా పరుగులు పెడుతుంటే.. అంతే వేగంగా సైబర్ నేరగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. మొదట బ్యాంకు వివరాలు అని ఫోన్ చేయటం, తమ ఎకౌంట్ లో డబ్బులు కట్ అయిపోయాయని లబోదిబోమంటూ వచ్చే కేసుల సంఖ్య పెరిగిందని పోలీసులు అంటున్నారు.
ఇవి ఇలా ఉంటే..లాటరీ వచ్చిందంటూ ఫోన్ చేయటం నమ్మి వారికి రెస్పాండ్ అయితే పాలసీలు, డిపాజిట్లు చేయాలని డబ్బులువసూలు చేసే ముఠాలు ఎక్కువగయ్యాయి. ఈ మోసాలకు చదువులేని వాళ్లే బలైపోతున్నారనటానికి లేదు...చదువుకున్న వారు కూడా ఇలాంటి వాటికి బలైపోతున్నారు. సిప్ పని చేయటం లేదని, బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిందని వచ్చే కాల్స్ అస్సలు నమ్మకూడదు. ఎనీ డెస్క్ లాంటి యాప్ ఇనిస్టాల్ చేసుకోండి ప్లాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పేవారి మాటలు నమ్మితే మీ పనిఅయిపోయనట్లే.
ఫోన్ పోయినా. లేక దొంగతనానికి గురైనా అందులో సమాచారంతో అమ్మాయిలకు ఎక్కువ కష్టాలు వస్తున్నాయని పోలీసులు అంటున్నారు. కొద్దిరోజులుగా విశాఖ ప్రజలపై సైబర్ నేరగాళ్లు గురిపెట్టారు. రాష్ట్రంలో ఒక్క విశాలోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయని పోలీసులు అంటున్నారు. వ్యక్తిగత వివరాలు సేకరించి వాటి ఆధారం చేసుకోని బెదిరింపులకు దిగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. సైబర్ మోసాలకు గురైతే భయపడకుండా తమను ఆశ్రయించాలని వివరాలు గోప్యంగా ఉంచి న్యాయం చేసేలా కృషి చేస్తామంటున్నారు.