స్మార్ట్ఫోన్ల వాడకంతో ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ అనేది మనకు ఎంత ఉపయోగమో, అదేవిధంగా నష్టం కూడా ఉంది. స్మార్ట్ ఫోన్ల ద్వారా తెలిసీ తెలియని వయసులో ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ వాడకమే ఈ బాలిక తండ్రి ప్రాణాలు తీసింది. అది ఎక్కడో తెలుసుకుందాం.. వరంగల్ రూరల్ లోని పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందినటువంటి మైనర్ బాలిక స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడి అనుక్షణం ఫేస్బుక్ లో గడుపుతూ ఉండేది. ఈ తరుణంలోనే తిరుపతి ప్రాంతానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడు 28 సంవత్సరాలు. అతని ట్రాప్ లో పడింది.
దీంతో ఆయనతో ప్రతిరోజు చాటింగ్ చేసేది. ఒకరోజు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోవడంతో ఆమె తండ్రి నాగరాజు అక్కడే ఉన్నటువంటి పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నటువంటి పోలీసులు విచారణ జరుగుతుండగానే బాలిక తండ్రి నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విచారణ చేపడుతున్నటువంటి పోలీసులకు ఈ కేసు చాలా సవాలుగా మారింది. ఆ బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయే ముందు మొబైల్ ఫోన్ కూడా తీసుకెళ్లా కాకపోవడంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు కత్తిమీద సాములా తయారైంది. అయితే నూతన టెక్నాలజీ ఉపయోగించి కేసును విచారించిన పోలీసులు తిరుపతి చెందిన పైడి రాజశేఖర్ అనే యువకుడిగా నిర్ధారణకు వచ్చారు. సదరు యువకుడు ఫేస్బుక్లో ప్రేమ చాట్ చేసి ఈ బాలికను కిడ్నాప్ చేసినట్లు నిర్ధారించుకున్నారు వెంటనే రంగంలోకి దిగిన టువంటి ఎస్ఐ నవీన్ కుమార్, సీఐ విశ్వేశ్వర ఆధ్వర్యంలో పలు బృందాలుగా విడిపోయి బాలిక ఉన్నటువంటి స్థలాన్ని కనిపెట్టారు.
రాజశేఖర్ దగ్గర ఉన్నటువంటి బాలికను చైల్డ్ హోమ్ కు తరలించి, ప్రేమ పేరుతో బాలికను ట్రాప్ చేసినటువంటి రాజశేఖర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అంటే తెలిసీ తెలియని వయసులో మొబైల్ ఫోన్ల వాడకం వల్ల పిల్లలు ఇలాంటి దురలవాట్లకు అలవాటుపడి ఇలా జీవితాలు నాశనం చేసుకుంటూ తల్లిదండ్రుల పరువు తీస్తున్నారని, ఆన్లైన్ క్లాస్ ల పేరుతో పిల్లలు మొబైల్ వాడకం ఎక్కువ చేశారని అప్పుడప్పుడు వారు ఏం చేస్తున్నారో గమనించాలని ఏసీపీ నరేష్ కుమార్ తెలియజేశారు.