దేశంలో రోజురోజుకు లైంగిక దాడులు సంఖ్య పెరిగిపోతోంది. కనీసం మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతోంది. ఎటు వెళ్లినా అక్కడ హింసకు గురవుతున్నారు. మగ మృగాల చేతిలో నలిగిపోతున్నారు. ఇలా దేశంలో అనేక అనేక అత్యాచారాలు రోజు జరుగుతున్నాయి. ఇందులో దాదాపు 75% ఈ అత్యాచార కేసులో బయటకు రావడం లేదు. బయటకు వస్తే ఏం జరుగుతుందో అని, మళ్ళీ వివాహం ఎవరు చేసుకోరని అలా రకరకాల ఆలోచనలతో లైంగిక దాడికి గురైనటువంటి బాధితులు బయటకు వచ్చి కేసులు పెట్టడం పెట్టడం లేదు. ఉత్తరప్రదేశ్ లో ఒక మైనర్ అమ్మాయి పై నలుగురు వ్యక్తులు తన సోదరుడి ముందే తీవ్రంగా అత్యాచారం చేశారు. వివరాలు ఏంటో తెలుసుకుందాం..?
ఆమె మైనర్ అమ్మాయి తన సోదరుడిని బంధించి అమ్మాయిపై నలుగురు మానవ మృగాలు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఈ తతంగం అంతా తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. బయట చెప్తే వీడియోలు బయటపెడతామని బెదిరింపులకు గురి చేశారు. ఈ అమానుష ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్లోని పుగావా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ముజఫర్ నగర్లోని 15 సంవత్సరాల బాలిక తన ఇంట్లో ఉంది. తనతో పాటు తన సోదరుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఈ సమయంలోనే అదే గ్రామానికి చెందినటువంటి నలుగురు వ్యక్తులు రహీబ్, సాహెబ్, ఆరిఫ్, మారుప్ అనే ముగ్గురు యువకులు ఆ ఇంట్లోకి వచ్చారు. పక్కనే ఉన్నటువంటి తన సోదరుడిని గట్టిగా బంధించారు.
ఆ తర్వాత ఆ 15 సంవత్సరాల ఆ బాలికపై ఈ నలుగురు ఒకరి తర్వాత ఒకరు తీవ్రంగా అత్యాచారం చేశారు. ఈ తతంగం అంతా తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసుకున్నారు. ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతామని బెదిరింపులకు గురి చేసి ఆ ముగ్గురు పరారయ్యారు. దీంతో సదరు బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు లైంగిక నేరాలు కేసుల కింద పిల్లల రక్షణ చట్టం కింద ఈ నలుగురిపై కేసు నమోదు చేశామని డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ శరత్ చంద్ర వర్మ తెలియజేశారు.