ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ ఆస్పత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ పైన చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నాయి విపక్షాలు. అయితే ఈ ఘటన జరిగి... నాలుగు రోజులు గడవక ముందే హైదరాబాద్లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్లోని పలు వురు ఆటో డ్రైవర్లు తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు 20 ఏళ్ల యువతి సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ మేరకు సంతోష్ నగర్ పోలీసులను ఆశ్రయించింది బాధిత బాలిక.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇందులో భాగంగానే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.... షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసు ను చేధించిన పోలీసులు.. యువతి ఆడిన నాటకాన్ని బట్ట బయలు చేశారు.. తనను ముగ్గురు ఆటో డ్రైవర్ ఎత్తు కెళ్లి గ్యాంగ్ రేప్ చేశార ని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు ఉరుకులు పరుగులు పెట్టిన సిటీ పోలీసులు.. యువతి చెప్పిన సమయానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ సీసీటీవీ ఫుటేజీల్లో యువతి బండారం బయటపడింది.
యువతిని కిడ్నాప్, అత్యాచారం జరిగినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఘటన పై యువతి ని పదే పదే ప్రశ్నించారు పోలీసులు. తన బాయ్ ఫ్రెండ్ కి వివాహ నిశ్చయం కావడంతో అతన్ని కేసులో ఇరికించడానికి గ్యాంగ్ రేప్ నాటకమాడినట్లు చివరికి యువతి ఒప్పుకుంది. దీంతో ఆ యువతి పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులను ఇలా తప్పు పట్టించడం కారణంగా నిజమైన బాధితులకు న్యాయం జరగదని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. అయితే.. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.