కొడుకును చంపి కరోనా పై నెత్తిన తండ్రి !

Veldandi Saikiran
చిత్తూరు జిల్లా లో మరో దారుణం చోటు చేసుకుంది.  కన్న కొడుకు ను కడ తేర్చి కరోనా మహమ్మారి  వచ్చి చని పోయాడని నమ్మించాడు ఓ కసాయి తండ్రి.  కుమారుడు గణేష్ ను కడతేర్చి  ఇంట్లో నే పూడ్చేసి..  కరోనా మహమ్మారి  వచ్చి చని పోయాడని నమ్మించాడు తండ్రి రామకృష్ణ.  చిత్తూరు జిల్లా లోని పీలేరు మండలం తలుపుల గ్రామం అబ్బిరెడ్డి గారి పల్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.  అయితే తల్లి ఫిర్యాదు తో వెలుగులోకి వచ్చింది ఆ తండ్రి చేసిన ఘాతుకం.   తల్లి ఫిర్యాదు తో తండ్రి  రామకృష్ణ ఇంట్లో తవ్వి శవాన్ని బయటకు తీశారు పీలేరు  పోలీసులు.  

అయితే ఆ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పీలేరు  పోలీసులు.  ప్రస్తుతం ఆ బాబు హత్య కు గల కారణాల కోసం పోలీసులు  ఆరా తీసుకున్నారు.  అయితే కొన్ని రోజుల నుంచి మనస్పర్ధ లు కారణంగా విడి విడి గా ఉంటున్నారు  రామకృష్ణ, భార్య మల్లెమ్మ.  ప్రైవేటు డ్రైవర్ గా పని చేస్తూ తండ్రి తోనే కలసి ఉంటున్నాడు మృతుడు గణేష్.   అయితే రామ కృష్ణ ఇంట్లో తవ్వి శవాన్ని వెలికి తీయడం తో షాక్ కు గురవుతున్నారు  గ్రామస్తులు. కన్న కొడుకును చంపడం ఏంటని స్థానికులు కూడా నిప్పులు చెరుగు తున్నారు.

రామకృష్ణ కు అక్రమ సంబంధం ఉందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.  ఆ అక్రమ సంబంధం నేపథ్యం లోనే తన భార్య అయినటు   వంటి మల్లెమ్మ కు దూరం పెట్టడని స్థానికులు అంటున్నారు. అంతే కాదు  మల్లెమ్మ నుంచి తన కొడుకు కూడా దూరం చేశాడని చెబుతున్నారు. ఇప్పుడు  అ న్యాయంగా కొడుకు ను హత్య చేశాడని ఫైర్ అవుతున్నారు.  అటు    మృతుడు గణేష్ తల్లి కూడా  రామకృష్ణ ను శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.   ఇక  ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పీలేరు పోలీసులు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: