కళ్లల్లో కారం చల్లి.. ఎంత పని చేశారు?

praveen
ఒకప్పుడు మృగాలను చూస్తే మనుషులు భయ పడే వారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా మనుషులను చూస్తే మృగాలే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎందు కంటే మృగాల కంటే దారుణం గా అంతకు మించిన మృగాలు గా మారి పోతున్నారు మనుషులు. మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు ఇక ఇప్పుడు అదే మానవత్వం లేకుండా దారుణం గా హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. సభ్య సమాజం లో మనుషుల మధ్య బ్రతకడానికి కూడా సాటి మనిషి భయపడే పరిస్థితి ఏర్పడింది.

 నేటి రోజుల్లో మనుషుల మధ్య బ్రతకడం కంటే అడవిలోకి వెళ్లి ఆ జంతువుల మధ్య బ్రతికితే బెటర్.. కాస్తయినా రక్షణ ఉంటుంది అని భావిస్తున్నారు. ఎందు కంటే ఇక నేటి రోజుల్లో మనుషుల్లో మానవత్వం కరువై పోతున్న నేపథ్యం లో ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి ఆపద ముంచు కొస్తుందో కూడా ఊహకందని విధంగా ఉంటుంది. చిన్నచిన్న కారణాలకే దారుణం గా సాటి మనిషి ప్రాణాలు తీయడానికి ఎక్కడ వెనకడుగు వేయడం లేదు.  దీంతో నేటి రోజుల్లో ఎన్నో దారుణమైన హత్యలు వెలుగు లోకి వస్తు సభ్య సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి.

 చిన్నచిన్న కారణాలకే ఏకంగా ఉన్మాదులు గా మారి పోయి హత్యలకు పాల్పడుతు చివరికి కటకటాలపాలవుతున్నారు ఎంతో మంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం అలంకాన్ గూడ గేట్ వద్ద జరిగిన దారుణ హత్య స్థానికులు అందరిని కూడా భయబ్రాంతులకు గురి చేసింది.  వ్యక్తి కళ్లల్లో కారం చల్లి దుండగులు దారుణంగా కత్తులతో నరికి హత్య చేశారు. మృతుడు మహాలింగ పురానికి చెందిన వెంకటయ్య గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: