హైదరాబాద్ లో కీచక టీచర్..భయం తో బడి మానేసిన విద్యార్థినులు..!

MADDIBOINA AJAY KUMAR
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నా దుర్మార్గులలో అసలు మార్పు రావడం లేదు. ఎక్కడో ఒక దగ్గర మహిళలపై లైంగిక దాడులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మరోవైపు కామం తో కళ్ళు మూసుకుపోయిన మృగాళ్లు చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాద్యూయుడే విద్యార్థినులను వేధించడం మొదలు పెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని దోమల్ గూడ గగన్ మహల్ లో చోటు చేసుకుంది. గగన్ మహల్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్ కీచకపర్వం వెలుగులోకి వచ్చిందిి .

చదువు చెప్పాల్సిన  ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. పిల్లల ఫోటోలను తీస్తూ తాను చెప్పినట్లు వినాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు. 
ఆ కీచక టీచర్ శ్రీనివాస్ ప్రవర్తనతో స్కూలుకు వెళ్లాలంటేనే విద్యార్థినులుభయపడిపోతున్నారు. స్కూలుకు వెళ్లకుండా ఇంట్లో ఏడుస్తూ విద్యార్థినులు కూర్చుంటున్నారు. ఈ విషయం స్టూడెంట్స్ తమ పేరెంట్స్ కు చెప్పడం తో తల్లిదండ్రులు వెళ్లి నిలదీశారు. దాంతో గత కొంత కాలంగా పిల్లాలతో , తోటి మహిళ టీచర్ లతో కూడా శ్రీనివాస్ ఇలాగే ప్రవర్తిస్తున్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తన వైఖరిలో మార్పు రార్పు రాలేదని పాఠశాల హెచ్ ఎం చెబుతోంది .
ఇదిలా ఉంటే కీచక టీచర్ వికలాంగుడు కావడంతో దాడి చెయ్యకుండా విద్యార్ధినుల తల్లి తండ్రులు చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు. ఇకనైనా ఆ టీచర్ ప్రవర్తనలో మార్పు రావాలని తల్లి దండ్రులు అంటున్నారు. చదువు చెప్పే టీచర్ ఇలా ప్రవర్తిస్తే విద్యార్థులు ఇంకా ఏం నేర్చుకుంటారు అని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఫిర్యాదు చేసినా కూడా కీచక టీచర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని తల్లి తండ్రులు ప్రశ్నిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: