దేశంలో మహిళలపై దారుణాలకు బ్రేక్ పడటం లేదు. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రూపంలో మహిళలు మానవమృగాళ్ల చేతుల్లో చితికిపోతూనే ఉన్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ కీచకుడు వ్యభిచారం చేయాలంటూ వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపుతోంది. తనను వదిలిపెట్టాలంటూ ప్రాదేయపడినా విడిచిపెట్టకుండా దుర్మార్గుడు రక్తం వచ్చేలా యువతిపై దాడి చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. అయితే యువతిపై దాడి జరిగి మూడు నెలలు అవుతుండా దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే యువతికి 18 రోజుల కిందటే వివాహం జరిగినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...నెల్లూరు జిల్లా రామకోటయ్య నగర్ కు చెందిన వెంకటేష్ అనే కీచకుడు వ్యభిచారం చేయాలంటూ యువతిపై కర్రతో దాడి చేశాడు. యువతిని కర్రతో కొడుతూ ఉండగా మరో వ్యక్తితో ఆ దారుణాన్ని వీడియో తీయించాడు.
ఈ దాడిలో యువతి చేతులకు గాయాలు కావడం వల్ల రక్తం కారుతుంది. తన కుంటుంబ సభ్యులు చూస్తే తన పరువు పోతుందని యువతి ప్రాదేయపడుతుంది. అయితే కొట్టేటప్పుడు మధ్యలో చేతులతో ఆపితే బట్టలు చించేస్తా అంటూ దుర్మార్గుడు బెదిరిస్తూ దాడి చేయడం వీడియోలో కనిపిస్తుంది.
అంతే కాకుండా నీకు ఏం చెబితే నువ్వు ఏం చేశావంటూ...పలువురితో వ్యభిచారం చేయాలంటూ దుర్మార్గుడు యువతిని దారుణంగా హింసించాడు. ఇక ఈ వీడియో మూడు నెలల తరవాత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కాస్తా పోలీసుల దృష్టికి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి నింధితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతి పై దాడి చేసిన వ్యక్తితో పాటు పోలీసులు వీడియో తీసిన వాడిని సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక యువతిపై దాడి చేసి పైశాచిక ఆనందం పొందిన యువకుడు పోలీసుల అదుపులో ఉండగా అతడిని కఠినం గా శిక్షించాలంటూ వీడియో చూసినవాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ఇటీవల కాలంలో మహిళలపై దారుణాలు పెరిగినట్టు కనిపిస్తుంది. రోజుకో ఘటన వెలుగులోకి రావడం సంచనం రేపుతోంది.