తండ్రి చేసిన పనికి ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. పిల్లలకు మంచి చెడ్డలు నేర్పించాల్సిన తండ్రే బాధ్యత లేకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది కూడా కూతుళ్ల పెళ్లిళ్లు జరిగి కొడుకు పెళ్లీడుకు వచ్చిన వయసలో..దాంతో ఆ కుంటుబంలో తరచూ గొడవలు జరగటం ప్రశాంతత లేకపోవడంతో అతడి భార్య ఇద్దరు కూతుళ్లు కొడుకు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన బెంగుళూరులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే....బెంగుళూరులో శుక్రవారం శంకర్ అనే వ్యక్తి భార్య ఆయన ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకునే ముందు కుమారుడు మధుసాగర్ తన లాప్ టాప్ లో తమ ఆత్మహత్యకు తండ్రి అక్రమ సంబంధమే కారణమని పేర్కొనడం సంచలనం గా మారింది.
శంకర్ ఇద్దరు కూతుళ్లు సింధూ రాణి, సించన కూడా తమ తండ్రి వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నారని...దాంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని పేరొన్నారు. ఇక సించన తనకు అత్తింట్లో కూడా సుఖం లేదని లేఖలో పేర్కొంది. ఈ ఘటన శుక్రవారం జరగ్గా పోలీసులు కేసునమోదు చేసుకుని ఇంట్లో ఆధారాలు అన్నీ సేకరించారు. అయితే కుటుంబ సభ్యుల అంత్య క్రియల సమయంలో తన భార్య వల్లనే కుటుబం అంతా ఆత్మహత్య చేసుకుందని శంకర్ ఆరోపించారు.
తన భార్య వల్లే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటన అనంతరం పోలీసులు ఇంట్లో కేజీ బంగారం మరియు పన్నెండు లక్షల నగదు దొరకగా వాటిని సీజ్ చేశారు. శంకర్ విజ్ఞప్తి మేరకు పంచనామా నిర్వహించే సమయంలో పోలీసులు ఇంటిలోని ప్రతి భాగాన్ని వీడియో తీశారు. శంకర్ తో పాటు అల్లల్లు ప్రవీణ్ మరియు శ్రీకాంత్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుల మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని వెతుకున్నారు.