మొదట ఒక్కడు.. ఆపై 30 మంది.. దారుణం?
ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామంతో కళ్లు మూసుకుపోతున్న మానవ మృగాలు తీరులో మాత్రం మార్పు రావడంలేదు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుంటూ ఆడపిల్లలపై అత్యాచారం చేసి శిక్షలు నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఇలా అత్యాచారాలకు గురైన ఆడపిల్ల ముఖం దాచుకుని తిరుగుతుంటే అత్యాచారాలు చేసిన నిందితులు మాత్రం దర్జాగా తిరుగుతూ ఉండటం సభ్యసమాజంలో జరుగుతుంది. దీంతో కామాంధుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
రోజురోజుకు దేశంలో ఎక్కడో ఓ చోట ఆడపిల్లలపై అత్యాచారం జరిగిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మహారాష్ట్రలో ఇలాంటి ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై 30 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడటం సంచలనం గా మారిపోయింది. ఇక ఈ కేసులో ఇప్పటికే 22 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయగా.. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సదరు బాధిత బాలిక కు ఓ యువకుడితో సంబంధం ఉంది. ఆ యువకుడు బాలికను అసభ్యంగా వీడియోలు తీశాడు. వీడియోలు స్నేహితులు అందరికీ షేర్ చేశాడు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ చేసి 30 మంది బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అని పోలీసులు తెలిపారు.