షాకింగ్ : చికెన్ ముక్క ప్రాణం తీసింది?

praveen
మనిషి ప్రాణం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిది అని చెబుతూ ఉంటారు పెద్దలు.. పెద్దలు అలాగే చెబుతుంటారు అదంతా  ట్రాష్ అని కొట్టి పారేస్తూ ఉంటారు నేటి రోజుల్లో జనాలు.. కానీ నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనల చూస్తుంటే మాత్రం ఇదినిజమే అని నమ్మకుండా ఉండలేరు అందరు.. ఎందుకంటే సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఊహించని  ఘటనలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇక కొన్ని ఘటనల  గురించి తెలిసిన తర్వాత కూడా అంత మాత్రానికే ప్రాణం పోయిందా అని అందరూ ఆశ్చర్య పోక మానరు. సాధారణంగా చికెన్ తినడాన్ని అందరూ ఇష్టపడుతూ ఉంటారు.


 ఇక కాస్త సమయం దొరికిందంటే చాలు చికెన్ లాగించేస్తుంటారు. ఇక వారాంతంలో అయితే చికెన్తప్పనిసరిగా ఉండాల్సిందే. మరి కొంతమంది అయితే ముక్క లేనిదే ముద్ద దిగదు అన్న విధంగా ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన విషయం గురించి తెలిస్తే మాత్రం చికెన్ తినడానికి చాలామంది భయపడిపోతారు అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చికెన్ ముక్క ఏకంగా ఒక వ్యక్తి ప్రాణం తీసింది. కేవలం నిమిషాల వ్యవధిలో చూస్తూ చూస్తుండగానే ఒక వ్యక్తిప్రాణాలు కోల్పోయాడు. ఇలా చికెన్ ముక్క ప్రాణం తీసిన ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది.


 చికెన్ తింటుండగా గొంతులో ఎముక ఇరుక్కొని వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. చెన్నైలోని అందియురు సమీపంలోని కూచి కల్లూరు కి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తాపీ మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవలే మధ్యాహ్నం సమయంలో అదే ప్రాంతంలో ఉన్న స్నేహితుడు మునిరాజు ఇంటిలో కోడి మాంసం తిన్నాడు సుబ్రహ్మణ్యం. ఈ క్రమంలోనే చికెన్ తింటుండగా ఓ చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయ్యాడు సుబ్రహ్మణ్యన్. ఇక స్నేహితులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.  అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: