యువకుడి కడుపులో బంగారు ఉండలు.. ఎలా వచ్చాయంటే?
అయితే అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అక్రమార్కులు ఆటలు కట్టిస్తున్నప్పటికీ ఎక్కడ ఎవరు వెనకడుగు వేయడం లేదు. పోలీసుల కళ్లుగప్పి ఏదో ఒక విధంగా అక్రమాలకు పాల్పడలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది ఏకంగా ఒక ప్రయాణికుడి కడుపులో బంగారు ఉండలు ఉండడాన్ని గుర్తించిన అధికారులు ఏకంగా వైద్యుల సాయంతో వాటిని బయటకు తీశారు.. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే కోయంబత్తూర్ విమానాశ్రయానికి ఉదయం సమయంలో షార్జా నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను అధికారులు తనిఖీలు చేశారు
అయితే ఇలా అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అధికారులు అతన్ని గట్టిగా ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానాలు చెబుతూ వచ్చాడు. స్కాన్ మిషన్ తో అతని స్కాన్ చేయగా కడుపులో ఏకంగా మూడు ఉండలు ఉన్నట్లు తేలింది. వాటిల్లో పేస్టు చేసిన బంగారం తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఇక వైద్యుల సహాయంతో వాటిని బయటకు తీయించారు ఈ ఘటనలో 32 లక్షల విలువైన 640 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోసారూ.