పెద్ద పెద్ద నగరాల్లోనే మహిళల పై లైంగిక దాడులు జరుగుతున్నాయి. క్యాబ్ లలో లేదా బస్సు ల లో ప్రయాణం ఆలస్యం అవుతుందని ఆటోలో ప్రయాణం బెస్ట్ అని చాలా మంది యువతులు అలా వెళ్తున్నారు. అయితే నమ్మించి తీసుకెళ్ళి అతి దారుణంగా అత్యాచారం చేసి చివరికి ప్రాణాలను తీసేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మహా నగరం అయిన హైదరాబాద్ లో ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.
తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లొకి వెళితే.. మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన లంగర్ హౌస్ లో జరిగింది. రోజూ స్కూల్కు వెళ్లి వచ్చే క్రమంలో ఆటో డ్రైవర్ బాలిక వెంటపడ్డాడు. ఆదివారం ఉదయం దుకాణానికి వెళ్లిన బాలికను స్నేహితుడి తో కలిసి ఆటోలో ఓల్డ్సిటీలోని ఓ ఇంటికి తీసుకెల్లారు. అక్కడ కట్టేసి ఒకరి తరువాత మరొకరు అతి దారుణంగా రేప్ చేశారు.
రెండు రోజులు ఉంచుకొని నరకాన్ని చూపించారు. అమ్మాయి ఇంటికి రాక పోవడంతో భయపడిన అమ్మాయి తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బడా నాయకుల ఒత్తిడితో పోలీసులు కేసు నీరుగార్చే యత్నం చేస్తున్నారని అమ్మాయి పేరెంట్స్, ఆమె తరపు బంధువులు ఆరొపిస్తున్నారు. అమ్మాయి కోసం కంప్లైంట్ ఇవ్వగా.. సీసీ ఫుటేజీని పరిశీలించి ఆటో నంబర్ ఆధారంగా అమ్మాయి ఆచూకీ తెలుసుకున్నారు. వారిని అదుపులొకి తీసుకొని విచారణ చేపట్టారు.. అమ్మాయిని భరోసా కేంద్రానికి తరలించగా పలుమార్లు లైంగికదాడి జరిగినట్లు ఆమె తెలిపింది. ఆటోడ్రైవర్ను కాపాడేందుకు పలుకుబడి ఉన్న నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. గతం లో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. కానీ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడైనా తగు చర్యలు తీసుకుంటారెమో చూడాలి.