పాపం పేరెంట్స్.. ఇలా జరుగుతుందని తెలిస్తే స్కూల్ కు పంపేవారు కాదేమో?
విద్యార్థుల మధ్య చిన్నపాటి గొడవ ఏకంగా తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణా నగర్ లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడంతో ఒక విద్యార్థి మృతి చెందాడు. స్థానిక సాయి కృప పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు పేపర్ బాల్ తో గదిలో క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే నలుగురు విద్యార్థులు ఘర్షణ పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇక ఈ దాడిలో మన్సూర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే ఇక ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. ఇక కేవలం స్పృహ కోల్పోయాడు అని అనుకున్నారు పాఠశాల సిబ్బంది. కానీ పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధరించారు. దీంతో ఒక్కసారిగా స్కూల్ యాజమాన్యం షాక్ అయ్యింది ఇక ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు విగతజీవిగా ఉన్న కొడుకును చూసి బోరున విలపించారు.. ఇక బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి.