మరో ప్రాణం భలి.. కారణం అదే?

praveen
ఏపీలో జగన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తోంది అన్న విషయం తెలిసిందే. నిరుపేద కుటుంబాలను రోడ్డు పాలు చేయకూడదు అనే ఉద్దేశంతో మద్యం షాపులు అన్నింటినీ మూసివేసి ప్రభుత్వ మద్యం షాపులు నడుపుతోంది. అంతేకాకుండా ఇక ధరలు కూడా భారీగా పెంచేసి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చేసింది ప్రభుత్వం. ఇలా చేయడం వల్ల మందుబాబులు అందరూ కూడా మద్యానికి దూరంగా ఉండే అవకాశం ఉందని తద్వారా ఇక ఎన్నో పేద కుటుంబాలు సంతోషంగా ఉంటాయని జగన్ ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకుంది. కానీ ప్రస్తుతం మాత్రం మద్యం ధరలు పెరిగినప్పటికీ ఇక జనాలు నాటుసారా వైపు అడుగులు వేస్తున్నారు.



 ఇక ఇలా నాటు సారా బట్టీలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో అటు ఎంతోమంది నాటుసారాకు అలవాటు పడి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. పోలీసులు నిఘా ఏర్పాటు చేసినప్పటికీ పోలీసులు కళ్ళు కప్పి రహస్యంగా నాటుసారా బట్టీలు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది ఇటీవలే నాటుసారా కారణంగా ఎంతో మంది చనిపోయిన ఘటన సంచలనం గా మారిపోయాయ్. ఈ ఘటన గురించి మరవకముందే నాటుసారా కు మరో ప్రాణం బలి అయ్యింది.


 నాటు సారా తాగి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కల్తీ సారా తాగడం వల్ల మరణించాడని బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గడివేముల మండలం కే బొల్లవరం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు రెండు రోజుల నుంచి అధికంగా నాటుసారా తాగుతున్నట్లు బంధువులు తెలిపారు. అయితే ఇటీవలే ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు సుబ్బరాయుడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అతనికి నీరు తాగించే ప్రయత్నం చేశారు. ఇలా నీరు తాగిన కొద్ది సేపటికే సుబ్బారాయుడు మృతి చెందినట్లు భార్య అంకాలమ్మ తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: