ఆటోలో వెళ్తున్న యువతి.. బయటకు లాగి బట్టలు చింపి ఛీ ఛీ?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఆడపిల్లలపై వేధింపులకు సంబంధించిన ఘటనలు చూసిన తర్వాత ఈ లోకంలో ఆడపిల్లలకి పుట్టడమే మేము చేసిన పాపమా అని ప్రతి ఆడపిల్ల బాధపడుతూ బ్రతికే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు ఎంతో మంది కామాంధులు పశువుల్లా మీద పడిపోయి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని పోలీసులు ఎన్కౌంటర్లో పంపినప్పటికీ.. కోర్టులు ఉరి శిక్షలు విధించినప్పుడు ఎక్కడ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి.


 వెరసి ఒక వైపు మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తున్న ప్రతి ఆడపిల్ల కామందుల కోరల్లో చిక్కుకోకుండా జాగ్రత్తపడుతూ ప్రతిక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చదువుకోడానికి స్కూల్ కి వెళ్తే ఉద్యోగం చేయడానికి ఆఫీసుకు వెళితే ఇక అన్ని సమస్యలు చెప్పుకోవడానికి.. ఇంటికి వెళితే అక్కడికి వెళ్ళిన ఆడపిల్లలకు మాత్రం వేధింపులు తప్పడం లేదు. పరాయి వాళ్లే కాదు సొంత వాళ్ళు సైతం వేధింపులకు పాల్పడుతూ ఉండడంతో ఆడపిల్ల జీవితం మరింత దుర్భరంగా మారిపోతుంది.


 ఇటీవలే ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో ఇటీవలే ఓ యువతి ఆటోలో అత్తతో కలిసి ప్రయాణిస్తుంది. ఈ క్రమం లోనే సదరు యువతి పట్ల ఆకతాయిలు అమానుషం గా ప్రవర్తించారు. యువతిని ఆటోలో నుంచి బయటికి లాగి దారుణం గా వేధించడం గమనార్హం. ఇక ఆ యువతిని రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి బట్టలు మొత్తం చింపేశారు.  అంతేకాకుండా దారుణాన్ని మొత్తం వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టాము అంటూ తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: