అయ్యో పాపం.. భర్త ఇంత నీచుడు అని తెలియలేదు..చివరికి..

Satvika
పెళ్ళి తర్వాత అందరూ భర్తే తన సర్వస్వం అని నమ్ముతుంటారు.. అతను చెప్పిన విధంగా చేస్తారు..అతనే లోకం అని భావిస్తారు.కానీ ఈరోజుల్లో అందరూ అంత మంచి వాళ్ళు కాదు..సొంత భార్యను కూడా బజారు లో పెడుతున్న ఘటనలు చాలానె వెలుగు చూస్తున్నాయి.తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలు సైతం భర్తతో పంచుకుంటుంది. అయితే కొందరు మగవారు మాత్రం భార్యలను నానా ఇబ్బందులు పెడుతుంటారు..కానీ కొందరు మూర్ఖులు అదే అదునుగా చూసుకొని భార్యలను నానా హింసలకు గురి చేస్తున్నారు..తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

కట్టుకున్నవాడిలో కర్కోటకుడు ఉన్నాడనే విషయం ఆలస్యంగా తెలిసినా... కొందరు మహిళలు ఎలాగోలా జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. మరికొందరు మాత్రం ధైర్యంగా తిరగబడుతుంటారు. మధ్యప్రదేశ్‍లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. భర్తే కదా అని అతడి ముందే దుస్తులు మార్చుకునేది. కానీ అవన్నీ భర్త వీడియోల రూపంలో దాచుకున్నాడని తెలుసుకోలేకపోయింది. చివరకు ఏమైందంటే..మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని లసుడియా అనే ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ యువతికి నాలుగేళ్ల క్రితం కాన్పూర్‌ పరిధికి చెందిన యువకుడితో వివాహం చేశారు. పెళ్లి సమయంలో 40 తులాల బంగారం, కారుతో పాటూ వివిధ వస్తువులను కట్నం కింద అందజేశారు.

వివాహానంతరం హనీమూన్ పేరుతో భార్యను స్థానికంగా ఉన్న ఓ హోటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు. అయినా భర్తే కదా అని తనకు తాను సర్దిచెప్పుకొంది. అయితే రోజురోజుకూ భర్త మరింత నీచంగా ప్రవర్తించేవాడు.అతని ఆగడాలు మరింత ఎక్కువ అయ్యాయి.అత్తమామలు కూడా భర్తకే మద్దతు ఇచ్చారు. దీంతో చివరికి చేసేదిలేక.. భర్త చేసిన దారుణాన్ని కుటుంబ సభ్యులతో చెప్పి బోరున విలపించింది. ఇలాంటి భర్త తనకు వద్దంటూ నేరుగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి భర్త, అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు లో ఉంది.. వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: