షికారు సరదా.. ప్రాణం తీసింది?
ఏకంగా ఓకే ఘటనలో ఏడు మంది చిన్నారులు కావడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లల కోసం బోరున విలపిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది అని చెప్పాలి. జార్ఖండ్లోని గిరీద్ జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన తొమ్మిది మంది చిన్నారులు పంచ ఖేరో డ్యామ్ లో బోటు లో సరదాగా షికారుకు వెళ్లారు. కానీ ఇక ఆ డ్యామ్ లోనే మృత్యువు వారి కోసం ఎదురు చూస్తుంది అన్నది మాత్రం గ్రహించలేకపోయారు. అయితే సరిగ్గా డాన్ మధ్యలోకి వెళ్లగానే బోటు బోల్తా పడింది.
ఈ క్రమంలోనే పడవలో ఉన్న బోట్ మాన్ తో పాటు ప్రదీప్ సింగ్ అనే మరో వ్యక్తి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగతా ఎనిమిది మంది చిన్నారులకు ఈత రాకపోవడంతో ఇక వాళ్లు నీటిలో గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే వారి ఆచూకీ కోసం ప్రస్తుతం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు అనే చెప్పాలి. ఇలా గల్లంతయిన వారిలో అందరూ చిన్న పిల్లలు ఉన్నారని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరి ఆచూకీ కోసం ఎన్డిఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. కాగా ఇక తమ పిల్లలు మళ్లీ బ్రతికి వస్తారని ఒడ్డున కూర్చున్న తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరికొంత మంది భోరున విలపిస్తున్నారు.