భార్యను ఇంట్లోనే పాతిపెట్టిన భర్త.. మరీ ఇంత ప్రేమా?
మరికొంతమంది మాత్రం కట్టుకున్న వారితోనే జీవితం అంటూ చివరికి చావులోను చావు లోను తోడు నీడ గా ఉంటున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. భార్య లేకుండా తాను జీవితంలో ముందుకు వెళ్ళలేను అని భావించాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే భార్య చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ఎవరికి తెలియకుండా ఇంట్లోనే పాతి పెట్టాడు. ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా లో వెలుగులోకి వచ్చింది. స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు ఓంకార్ దాస్.. అతని భార్య పై అమితమైన ప్రేమ కలిగి ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇరుగుపొరుగువారు ఎంత వారించినా కూడా చనిపోయిన తన భార్యను ఇంట్లోనే సమాధి చేసి పూలతో అలంకరించారు.
ప్రతి రోజు కూడా భార్య మృతదేహం పక్కనే అతను నిద్రిస్తూ ఉండేవాడు అని చెప్పాలి. కష్టసుఖాల్లో కలిసి ఉండి 25ఏళ్ల పాటు కాపురం చేసిన భార్య లేకుండా తన అడుగు ముందుకు పడదు అంటూ ఓంకార్ దాస్ చెబుతూ ఉండేవాడు. అయితే స్థానికులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఓంకార్ వారిస్తున్నప్పటికీ కూడా లెక్క చేయని అధికారులు సదరు మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు.. అయితే గత పన్నెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓంకార్ భార్య రుక్మిణీ తుదిశ్వాస విడిచారు అని చెప్పాలి.