తండ్రికి అంత్యక్రియలు.. కానీ వారంరోజుల తర్వాత?
కానీ ఇటీవలి కాలంలో ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇంతకీ ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం ఏంటో తెలుసా కుటుంబసభ్యుల పొరపాటు. రోడ్డు ప్రమాదాల్లో ఎవరో చనిపోతే ఇక పొరపాటున మన కుటుంబ సభ్యులే అనుకొని చివరికి ఆ డెడ్ బాడీ కి అంత్యక్రియలు నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఆసుపత్రిలో ఒకరి శవానికి బదులు మరొకరి శవం ఇవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇటీవలే ఉత్తరప్రదేశ్లోని లఖిమ్ పూర్ ఖేరి లో ఇలాంటి ఒక ఆశ్చర్యకరమైన జరిగింది.
స్థానికంగా ఉండే ఇంద్ర కుమార్ అనే వ్యక్తి తన తండ్రి రాణా లాల్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఎన్నో రోజుల పాటు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ లభించలేదు. కానీ ఇటీవలే ఒక అనాధ శవం పోలీసులకు లభించింది.. ఇంద్ర కుమార్ తండ్రి పోలికలను కలిగి ఉంది. దీంతో చనిపోయింది తమ తండ్రి అనుకుని ఇంటికి తీసుకువచ్చారు. సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. కానీ కొన్ని రోజుల తర్వాత అతనికి ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది. మీ తండ్రి కాలికి గాయమై అపస్మారక స్థితిలో ఉన్నాడు అంటూ డాక్టర్ల ఫోన్ చేయడంతో హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లగా కళ్ళముందు తండ్రిని చూసి నమ్మలేకపోయాడు. జరిగిన పొరపాటు అర్థం చేసుకొని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.