తన కూతురు కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని.. బాలున్ని చంపిన తల్లి?
కానీ ఒక్కరిలో కూడా భయం కనిపించడం లేదు అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా తమ పిల్లలు బాగా చదవాలని తల్లిదండ్రులు కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇదే కోరుకుంటూ ఉంటారు. ఒకవేళ తమ పిల్లల కంటే వేరే పిల్లలు బాగా చదువుతున్నారు అంటే కొంతమంది అసూయ పడితే మరికొంత మంది వేరే వాళ్ళ పిల్లలను కూడా కాస్త ఎంకరేజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.
కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం దారుణానికి పాల్పడింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే తన కూతురు కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి అనే కారణంతో అభం శుభం తెలియని పిల్లాడికి విషమిచ్చి చంపింది ఓ తల్లి. ఎప్పుడు ఫస్ట్ వచ్చే తన బిడ్డను దాటేసి మణికందన్ అనే బాలుడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు. తన కూతురు మీద ప్రేమతో తల్లి విక్టోరియా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది. ఈ క్రమంలోనే కూల్డ్రింక్లో విషం కలిపి చివరికి ఆ పిల్లాడిని చంపేసింది. ఇలా చేస్తే తన కూతురికి తిరుగుండదని భావించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.